మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!

November 1, 2008

ఈ లోకంలో ధనసంపాదనకున్నంత ప్రాముఖ్యం అంతా యింతా కాదు.అది ఎంతగా జనంలోకి చొచ్చుకుపోయిందంటే దానికోసం జనం ఏమార్గానన్నుసరించినా తప్పుతేదనుకునే స్థాయికి చేరిపోయింది.ఇది విచారించాల్సిన విషయం.అసలు మనిషి ధనసంపాదన మీద ఇంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే--మనదగ్గర డబ్బు అనేదే లేకపోతే--

శ్లో!!
మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!
భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!
అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!
తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!! --సుభాషిత రత్నభాండారమ్

ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు.

అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం.

0 comments: